శ్రీశైలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు

నల్లగొండ జిల్లా:మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జడ్చర్ల శాసన సభ్యులు అనిరుధ్ రెడ్డితో కలిసి బుధవారం శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది కార్మికులు సురక్షితంగా తిరిగి రావాలని వేడుకున్నట్లు చెప్పారు.

లక్షలాది మంది రైతులు,ఫ్లోరైడ్ భాదితుల జీవితాలను మార్చే టన్నెల్ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రాజెక్ట్ పనులు కొనసాగాలని ఆ దేవదేవుణ్ణి వేడుకున్నానన్నారు.

Special Pujas Of Minister Komatireddy Venkat Reddy In Srisailam, Komatireddy Ven
స్టాండ్స్ లో చిన్నపిల్లలా ఏడ్చేసిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!

Latest Nalgonda News