రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో సిరిసిల్ల ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించే వరి ధాన్య కొనుగోలు కేంద్రంలో గన్ని బ్యాగులు నిల్వ చేసుకోవడానికి షెడ్ల నిర్మాణం చేయడానికి స్థల పరిశీలన చేసిన ప్రజా ప్రతినిధులు.కొనుగోలు కేంద్రాలలో వర్షాల కారణంగా బ్యాగులు తడిసి సంస్థకు నష్టం వాటిల్లుతున్న సందర్భంగా కొనుగోలు కేంద్రాలలో
రేకుల షెడ్ల నిర్మాణం అత్యవసరం కాబట్టి మంగళవారం అట్టి నిర్మాణానికి స్థల పరిశీలన చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, స్థానిక డైరెక్టర్ సత్తు వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు జి.రాజన్న, జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్, రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.