సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరెక్టర్లలో సతీష్ వేగేశ్న( Satish Vegesna ) ఒకరు ఈయన తీసిన శతమానం భవతి నేషనల్ అవార్డు గెలుచుకున్న విషయం మనకి తెలిసిందే.ఇక ఈ సినిమా తరువాత ఆయన చేసిన శ్రీనివాస కళ్యాణం, ఎంతమంచివాడవు రా అనే సినిమాలు ప్లాప్ అయ్యాయి దాంతో సతీష్ కి సినిమా ఇచ్చే హీరో లేకుండా పోయాడు ఇక అయన కొడుకుని హీరో గా పెట్టి ఒక సినిమా కూడా ప్లాన్ చేసాడు ఈ సినిమా కూడా స్టార్ట్ అయింది అంతే అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంకా ఎవరికీ తెలీదు…అయితే ప్రస్తుతం ఈయన ఎన్టీయార్ బామ్మర్ది అయినా నితిన్( Nitin ) ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక సినిమా చేస్తున్నాడు అనే టాక్ బాగా వినిపించినప్పటికీ ఆ సినిమా మాత్రం షూట్ నడుస్తుందా లేక మధ్యలోనే ఆగిపోయిందా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరెక్టర్లు ( Directors )కూడా వాళ్ళు చేసే సినిమాల మీద క్లారిటీ ఉండటం లేదు.జనాలు కానీ హీరోలు కానీ ఒక సినిమా ప్లాప్ అయిందంటే చాలు ఆ డైరెక్టర్ ని తీసి పక్కన పెట్టేస్తున్నారు.ఇక సతీష్ సినిమా ల్లో స్టోరీ అంత కూడా ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆయన ఈ జనరేషన్ కి తగ్గట్టు గా స్టోరీస్ ని రాయలేడు ఏమైనా కూడా పాత చింతకాయ పచ్చడి లాంటి స్టోరీస్ నే సినిమా గా తీస్తాడు కాబట్టి ఇప్పుడు ఏ హీరో కూడా ఆయనకి డేట్స్ ఇవ్వడం లేదు అంటూ ఆయన మీద చాలా కామెంట్లు చేస్తున్నారు…అయితే ప్రస్తుతం ఆయనకి డేట్స్ ఇచ్చే హీరో దొరకడం లేదు కాబట్టి ఈయన సినిమా ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు.అయితే ఈయన చిన్న హీరోలతో సినిమాలు చేయడం చాలా బెస్ట్ అని చాలా మంది అంటున్నారు.