హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్దకు సాహితీ బాధితులు భారీగా చేరుకుంటున్నారు.తమకు న్యాయం చేయాలంటూ బాధిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నిన్న సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీ నారాయణను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.లక్ష్మీనారాయణ బాధితుల్లో ఎన్ఆర్ఐలు, డాక్టర్లు, లాయర్లతో పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉన్నారని తెలుస్తోంది.తక్కువ ధరకే ఫ్లాట్లు అంటూ రూ.900 కోట్ల భారీ మోసం బయటపడింది.ప్రీ లాంచ్ పేరుతో కస్టమర్లను సాహితీ ఇన్ ఫ్రా టెక్ వెంచర్స్ నిండా ముంచినట్లు సమాచారం.ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.