CM Revanth Reddy : పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నెలకు రూ.25 వేల పెన్షన్..: సీఎం రేవంత్ రెడ్డి

పద్మ శ్రీ అవార్డు( Padma Shri Awardees ) గ్రహీతలకు నెలకు రూ.25 వేల పెన్షన్ అందిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.

హైదరాబాద్ లోని శిల్పకళావేదికగా పద్మ అవార్డు గ్రహీతలు తెలంగాణ ప్రభుత్వం సన్మానం నిర్వహించిన సంగతి తెలిసిందే.

వెంకయ్య నాయుడును( Venkaiah Naidu ) సన్మానించడమంటే మనం సన్మానం చేసుకోవడమేనని పేర్కొన్నారు.అలాగే 150 కి పైగా సినిమాలు చేసినా చిరంజీవిలో( Chiranjeevi ) అదే కమిట్ మెంట్ ఉందన్నారు.

తెలుగు భాష అభివృద్ధి, అంతరించిపోతున్న కళలను ప్రోత్సహిస్తామని తెలిపారు.భాష విషయంలో వెంకయ్యనాయుడు సూచనలను స్వీకరిస్తామని పేర్కొన్నారు.రాజకీయాల్లో వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి పదునైన భాషతో ప్రజా సమస్యలపై మాట్లాడేవారని తెలిపారు.

రాష్ట్రపతికి కావాల్సిన అన్ని అర్హతలు వెంకయ్యనాయుడుకు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి( President ) కావాలని కోరుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వ్యాఖ్యలు

తాజా వార్తలు