తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వివాదాస్పద దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ దర్శకుడు “రామ్ గోపాల్ వర్మ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే రామ్ గోపాల్ వర్మ టాలెంట్ ఉన్నటువంటి నటీనటులను వెతికి పట్టుకోవడంలో మంచి దిట్టని చెప్పవచ్చు.
ఆ మధ్య ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంటర్వ్యూ చేసేటువంటి యాంకర్ ని ఏకంగా “నిన్ను బికినీలో చూడాలని” ఉందని చెప్పడంతో ఆ యాంకర్ ఓవర్ నైట్ పాపులర్ అయిపోయింది.అంతేకాక బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం కూడా దక్కించుకుంది.
అయితే ఎప్పుడూ సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య తాను చేసే పనుల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.
అయితే తాజాగా తెలుగు యంగ్ హీరోయిన్ అంకిత మహారాణా అలియాస్ అప్సర రాణి బికిని దుస్తులు ధరించి స్విమ్మింగ్ పూల్ లో ఈదుతున్న సమయంలో తీసిన ఓ వీడియోని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది.
దీంతో రామ్ గోపాల్ వర్మ ఈ వీడియో పై స్పందిస్తూ… వావ్ చాలా బాగుందని… అందువల్లనే నేను నిన్ను ఏంజెల్ అని పిలుస్తానని… కానీ ఈ వీడియోని ఎవరు షూట్ చేశారంటూ ప్రశ్నించాడు.దీంతో అప్సర రాణి స్పందిస్తూ ఈ వీడియోని “లడకీ” చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న “పూజా భలేకర్” షూట్ చేసి తానే ఎడిట్ కూడా చేసిందని రిప్లై ఇచ్చింది.
దీంతో వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అంతేగాక ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ సందు దొరికితే గోవా వెళ్ళిపోయి బాగానే ఎంజాయ్ చేస్తున్నాడని కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ “డి కంపెనీ” అనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం అండర్ వరల్డ్ మాఫియా డాన్ “దావూద్ ఇబ్రహీం” జీవితగాధ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.
గత కొద్దికాలంగా రామ్ గోపాల్ వర్మ నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తూ వాటిని ఆన్ లైన్ లో విడుదల చేశాడు.కానీ ఆశించిన స్థాయిలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు.
దీంతో మళ్లీ “డి కంపెనీ ద్వారా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రామ్ గోపాల్ వర్మ సన్నాహాలు చేస్తున్నాడు.