మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో చరణ్ కీలక పాత్రలో నటించబోతున్న విషయం తెల్సిందే.మొదట ఆ పాత్రకు గాను
మహేష్ బాబు
ను అనుకున్నారు.
బడ్జెట్ మరీ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో చరణ్ను తీసుకున్నారు.ఈ చిత్రం షూటింగ్ ఇప్పటి వరకు పూర్తి అయ్యి వచ్చే నెలలో విడుదల అవ్వాల్సి ఉంది.
కాని కరోనా కారణంగా సినిమా షూటింగ్ జరగడం లేదు.ఇప్పటి వరకు 40 శాతం షూటింగ్ పూర్తి అయిన ఆచార్యను సెప్టెంబర్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆచార్య చిత్రంలో చరణ్ పాత్రకు సంబంధించి ప్రస్తుతం కీలక అప్డేట్ వినిపిస్తుంది.మొదటి నుండి అనుకుంటున్నట్లుగా కాకుండా ఈ చిత్రంలో చరణ్ పాత్రను తగ్గించనున్నారట.
చరణ్ షూటింగ్కు హాజరు అయ్యే అవకాశం తక్కువగా ఉంది.దానికి తోడు సినిమా షూటింగ్ను కేవలం 45 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అందుకే చరణ్ పాత్రను తగ్గించడం ద్వారా డేట్లు త్వరగా పూర్తి అవుతాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆచార్యలోని చరణ్ పాత్రను తగ్గించిన దర్శకుడు కొరటాల శివ ఆ తర్వాత మొత్తం పాత్రనే తొలగిస్తాడేమో అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం చరణ్ కోసం జక్కన్న ఎదురు చూస్తున్నాడు.ఆ కారణంగానే ఆచార్య చిత్రంకు డేట్లు ఇచ్చే విషయమై అనుమానంలో ఉన్నారట.
ఆచార్య షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.