స్టార్ హీరోల కోసం వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకుంటున్న ట్యాలెంటెడ్ యంగ్ దర్శకులకు ఓటీటీ వల వేస్తోంది.ప్రముఖ ఓటీటీ సంస్థలు అయిన ఆహా.
హాట్ స్టార్ ఇంకా పలు ఓటీటీలు దర్శకులను లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈమద్య కాలంలో ఓటీటీలు బాగా పాపులర్ అయ్యాయి.
థియేటర్లు మూత పడటంతో అంతా కూడా ఓటీటీ దారిలో పడ్డారు.ప్రేక్షకులు ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ను వెదుకుతుంటే.
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ దాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి.
కొత్త సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు.ఇదే సమయంలో సినిమాల స్థాయిలో వెబ్ సిరీస్లను కూడా రూపొందిస్తున్నారు.తాజాగా ప్రముఖ నటీనటులు కూడా ఓటీటీ కోసం వెబ్ సిరీస్లో నటించేందుకు సిద్దం అవుతున్నారు.
ఇలాంటి సమయంలో దర్శకులు కూడా వెబ్ సిరీస్ల మేకింగ్పై దృష్టి పెట్టినట్లుగా సమాచారం అందుతోంది.భారీ బడ్జెట్ పెట్టి అడిగినంత పారితోషికం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నందున దర్శకులు పలువురు ఓటీటీ కోసం కంటెంట్ రెడీ చేసే పనిలో ఉన్నారు.
ప్రముఖ దర్శకుడు క్రిష్ నుండి మొదలుకుని కొత్త దర్శకులు మేర్లపాక గాంధీ..ప్రశాంత్ వర్మ వంటి వారు ఎంతో మంది వెబ్ సిరీస్ల మేకింగ్లో పడిపోయారు.చిరంజీవి కుమార్తె సుష్మిత కూడా వెబ్ సిరీస్ల నిర్మాణం మొదలు పెట్టారు.ఇప్పటికే మహేష్బాబు కూడా వెబ్ సిరీస్ల నిర్మాణం చేపట్టారు.ఈ నేపథ్యంలో స్టార్ ఫిల్మ్మేకర్స్ వెబ్ సిరీస్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
దానికి తోడు ఓటీటీ వారు భారీ పారితోషికంతో ఊరిస్తున్న నేపథ్యంలో వారు అంతా అటుగా ఆకర్షితులు అవుతున్నారు.