ఏపీకి పట్టిన చంద్రగ్రహణం పోయిందని ప్రజల సంతోషంగా ఉన్నారని మంత్రి కారుమూరి అన్నారు.ఇక గెలవలేమన్న నిరాశతో చంద్రబాబు ప్రజలను తిడుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు బూతులు తిడుతుంటే ఇదేమి ఖర్మ అని ప్రజలు బాధపడుతున్నారని ఆయన తెలిపారు.చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా టిడిపి దిగజారి పోతుండటంతో ఇదేమి ఖర్మ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో టిడిపికి మూడు సీట్లు కూడా రావని మంత్రి వ్యాఖ్యానించారు.సీఎం జగన్ చెబుతున్నట్లే 175 సీట్లలో వైసీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.