మ‌య‌న్మార్,థాయ్ ల్యాండ్ దేశాల‌లో నేడు భారీ భూక‌పం

నల్లగొండ జిల్లా:మ‌య‌న్మార్, థాయ్ ల్యాండ్ దేశాల‌లో నేటి ఉదయం భారీ భూక‌పం సంభవించింది.భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్ పై 7.

7 గా న‌మోదైంది.ఈ భూకంపం ధాటికి ఆయా దేశాల‌లో భారీగా ఆస్తి,ప్రాణన‌ష్టం జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

దీని తీవ్ర‌త‌కు ప‌లు భ‌వ‌నాలు కుప్ప‌కూలాయి.ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి భ‌యంతో ప‌రుగులు తీశారు.

మ‌రికొంద‌రు ప్రాణాలు రక్షించేందుకు ఈత కొల‌నుల‌లో దూకారు.ఇక బ్యాంకాంక్ లో ఈ భూకంప తీవ్ర‌త 7.3 గా న‌మోదైంది.ఈ న‌గ‌రంలో అనేక భ‌వ‌నాలు నేల‌మ‌ట్ట‌మైన‌ట్లు అక్క‌డి మీడియా వెల్ల‌డించింది.

Advertisement

స‌హాయ కార్య‌క్ర‌మాల కోసం సైన్యాన్ని రంగంలోకి దించారు.వంద‌లాది మంది క్ష‌త‌గాత్రుల‌ను స‌మీపంలోని హాస్పిట‌ల్స్ కు త‌ర‌లిస్తున్నారు.

దీనిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.కాగా ఈ దేశాలలో ముందు జాగ్రత్త చర్యలుగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Latest Nalgonda News