డిగ్రీలో ప్రవేశాలకు చివరి అవకాశం:డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్

నల్లగొండ జిల్లా:డిగ్రీలో ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చివరి అవకాశం కల్పించిందని నల్లగొండ జిల్లా నకిరేకల్(Nakrekal ) ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బెల్లి యాదయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

ఈనెల 4 నుంచి 9 వరకు డిగ్రీ ప్రవేశాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని,ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు బిఏ,బీకాం,బీఎస్సీ కోర్సుల్లో చేరేందుకు ఛాన్స్ ఉందన్నారు.

అర్హతలు ఉన్నవారు నేరుగా నకిరేకల్ డిగ్రీ కళాశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు.

మనిషి ప్రాణాలకు ఖరీదు కడుతున్న నవాబులు...!

Latest Nalgonda News