నిన్న చిరంజీవి( Chiranjeevi ) పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయనే సంగతి తెలిసిందే.అభిమానుల సపోర్ట్ వల్ల చిరంజీవి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.
తన ఎనర్జీ లెవెల్, గ్రేస్ తో చిరంజీవి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.ప్రముఖ నటుడు కాకరాల సత్యనారాయణ( Kakarala Satyanarayana ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు రామలింగయ్య, చిరంజీవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
అల్లు రామలింగయ్య గారు కులంతోనే నరుక్కుంటూ వచ్చారని ఆయనతో నేను యుద్ధం చేస్తూ వచ్చానని తెలిపారు.
చివరి రోజుల్లో రామలింగయ్య( Allu Ramalingaiah ) పొలిటికల్ క్యారెక్టర్స్ చూస్తే బాధేసిందని ఆయన అన్నారు.
అల్లు రామలింగయ్య గారు లైన్ లో నరుక్కుంటూ వచ్చి తను అనుకున్నది సాధించారని కాకరాల సత్యనారాయణ వెల్లడించారు.అల్లు రామలింగయ్య రాజకీయ చైతన్యం ద్వారా మార్చలేమని అనుకున్నారని సత్యనారాయణ పేర్కొన్నారు.
చిరంజీవి కెరీర్ లో సక్సెస్ అయ్యేలా అల్లు రామలింగయ్య కష్టపడ్డారనే అర్థం వచ్చేలా ఆయన చెప్పుకొచ్చారు.
అల్లు రామలింగయ్య గారు తన గురువులను వదిలేశారని ఆయన కామెంట్లు చేశారు.సీనియర్ ఎన్టీఆర్,( Sr NTR ) ఏఎన్నార్( ANR ) మధ్య పోటీతత్వం ఉన్నా ఒకరినొకరు గౌరవించుకునేవారని సత్యనారాయణ తెలిపారు.కాంతారావు గారి చివరి జీవితం గురించి వచ్చిన వార్తలు నా దృష్టిలో పుకార్లు అని ఆయన కామెంట్లు చేశారు.
అప్పట్లో ఆర్టిస్టులకు గుర్రాల వ్యసనాలు, ఇతర వ్య్ససనాలు ఉండేవని కాకరాల సత్యనారాయణ పేర్కొన్నారు.
అదృష్టం, దురదృష్టం గురించి ఎవరూ చెప్పలేరని ఆయన అన్నారు.రామోజీరావు( Ramojirao ) మొత్తం మోనోపాలీ చేశారని అయితే ఇప్పుడు ఆయన ఇబ్బందులు పడుతున్నారని నాకు అలా ఉన్నా ఇబ్బందే ఇలా ఉన్నా ఇబ్బందే అని ఆయన కామెంట్లు చేశారు.కే.
విశ్వనాథ్ గారి సినిమాల్లో కూడా నేను చేశానని సత్యనారాయణ తెలిపారు.అల్లు రామలింగయ్య గురించి కాకరాల సత్యనారాయణ చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఆరోపణల గురించి అల్లు ఫ్యామిలీ( Allu Family ) నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుందేమో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.చనిపోయిన వాళ్లపై విమర్శలు చేయడం సరికాదని కొంతమంది చెబుతున్నారు.