ఇష్టమైన హీరోల పేర్లతో సినిమాలు రావడం ఇండస్ట్రీలో కామన్ గా జరిగే విషయమే.అయితే ఇప్పుడు దర్శకుడిపేరుతో సినిమా రానుంది.
వివరాల్లోకెళ్తే.కమెడియన్ నుండి హీరోగా అవతారం ఎత్తిన సునీల్ తొందరపడి వరుస సినిమాలు చేయకుండా ఓ ప్లానింగ్తో సినిమాలు చేసుకుంటూ ముందుకెళుతున్నాడు.
ప్రస్తుతం జోష్ ఫేమ్ వాసువర్మ దర్శకత్వంలో రూపొందుతోన్నచిత్రం కృష్ణాష్టమి.చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.
ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాతి తర్వా త విడుదల చేయాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు.ఇది కాకుండా ప్రస్తుతం వంశీకృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.
పి.ఎ.ప్రొడక్షన్స్ బ్యానర్పై సుదర్శన్ రెడ్డి నిర్మాతగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను ముందుగా అగ్గిపుల్ల, సైనికుడు అనే టైటిల్స్ వినపడ్డాయి.
అయితే ఇప్పుడు జక్కన్న అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు.ఇక్కడొక విషయం ప్రస్తావించుకోవాలి.
అదేంటంటే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళిని అందరూ ముద్దుగా జక్కన్న అని పిలుస్తుంటారు.ఇప్పుడు అదే టైటిల్తో సునీల్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడట.