మేడ్చల్ జిల్లాలో నిషేధిత డ్రగ్స్ పట్టుబడ్డాయి.జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే హెరాయిన్ ను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితులు రాజస్థాన్ కు చెందిన వారిగా గుర్తించారు.
అనంతరం వారి వద్ద నుంచి 20 గ్రాముల హెరాయిన్ తో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.