ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించిన త్రో బ్యాక్ ట్రెండ్ నడుస్తోంది.సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోలు షేర్ చేసి ఆ ఫోటోలో ఉన్న సెలెబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా? ఆ ఫోటోలో ఉన్న సెలబ్రిటీ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ తెలుసా అంటూ క్యాప్షన్ లు కూడా రాస్తూ ఉంటారు.ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా కూడా సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది.
ఆ ఫోటోలో దివంగత మాజీ రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం తో అటు మరొక అమ్మాయి కూడా కనిపిస్తోంది.అయితే ఆ ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ప్రస్తుతం తెలుగులో ఒక క్రేజీ హీరోయిన్.
సినిమాలో హీరోయిన్ గా నటించి తన అందం అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ ఫోటోలో ఉన్న చిన్నారి మరవరో కాదు ముద్దుగుమ్మ సురభి.
బీరువా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సురభి ఆ తర్వాత ఎక్స్ప్రెస్ రాజా ఎటాక్, జెంటిల్మెన్, ఒక క్షణం, శశి లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.కాగా సురభి చివరగా శశి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.
అయితే అందం అభినయం ఉన్నప్పటికీ సురభికి అవకాశాలు మాత్రం అంతగా కలిసి రాలేదు.
మొదట తమిళ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సురభి కోలీవుడ్లో వరుసగా మూడు సినిమాలలో నటించి మెప్పించింది.అనంతరం సందీప్ కిషన్ హీరోగా నటించిన బీరువా సినిమాతో తెలుగు ఇండస్ట్రీ పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.ఇకపోతే ప్రస్తుతం సురభి సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సురభి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అబ్దుల్ కలాం తో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేసింది.
ఆ ఫోటో పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.