ప్రముఖ బాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ దీపికా పదుకొనే గురించి, తన నటన గురించి అందరికీ తెలిసిందే.తన అందంతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ముందుంటుంది.2018లో రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.కాగా ఇటీవలే తన వ్యక్తిత్వం గురించి అభిమానులకు తెలిపింది.
19 ఏళ్లకే సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన దీపిక పదుకొనే 2006 కన్నడ చిత్రంలో పరిచయం కాగా ఆ తర్వాత బాలీవుడ్ లో ఓం శాంతి ఓం సినిమాలో పరిచయమైంది.కానీ ఇటీవలే తన గురించి కొన్ని విషయాలు అభిమానులకు తెలపగా తన ఇంట్లో పని తానే చేసుకుంటుందని తెలిపింది.
అందరి స్త్రీ లానే పొద్దున్నే నిద్రలేచి తన ఇంటి పనులు తానే స్వయంగా చేసుకుంటుందట.ఒక్కోసారి ఇంట్లో నీళ్లు రానప్పుడు, ఇంట్లో పని వాళ్ళు తమకు వీలుకాక రాలేనప్పుడు ఇంట్లో ఉన్న పని మొత్తం దీపికానే చేసుకుంటుందట.
ఇంటికి అవసరమైన వస్తువులను, వంట కి సంబంధించిన వస్తువులు అన్నీ తానే ఆర్డర్ చేస్తుందట.ఈ అలవాటు నాకు ఎప్పటినుంచో ఉంది.
ఇప్పటికైనా అలాగే ఉంటాను.నా పనులు నేను చేసుకుంటాను.
అని దీపిక తెలిపింది.దీపిక ఇంట్లో పనిచేస్తున్న సమయంలో తన భర్త రణ్ వీర్ సింగ్ చూసి ఆచార్య పోతాడంట.
అంతే కాకుండా తనని ఇవన్నీ నీకెందుకు చెప్పు అని అంటాడట.కాగా తాను చేసే పని లో ఆనందంగా ఉంటుందని తెలిపింది.
ప్రస్తుతం దీపిక పదుకొనే కపిల్ దేవ్ బయోపిక్ లో హీరోయిన్ గా నటిస్తుంది.అదే సినిమాలో తన భర్త రణ్ వీర్ హీరోగా నటిస్తున్నాడు.కపిల్, కపిల్ భార్యగా ఈ జంట నటిస్తుండగా అభిమానులు జోడి కుదిరింది అంటూ కామెంట్ లను అందిస్తున్నారు.
.