కరోనా వ్యాక్సిన్ తయారుచేస్తున్న హైదరాబాద్కి చెందిన భారత్ బయోటెక్ సంస్థ తీపికబురు అందించింది.వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా కరోనా వ్యాక్సిన్ను విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది.
భారత్ బయోటెక్ తయారుచేస్తున్న ‘కొవాగ్జిన్’ కరోనా వ్యాక్సిన్ ఫిబ్రవరిలో అందుబాటులోకి వస్తుందని ఐపీఎంఆర్ శాస్త్రవేత్త రజనీకాంత్ వెల్లడించారు.
ఇప్పటివరకు అందించిన సమాచారం ప్రకారం కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ సురక్షితంగా పనిచేస్తుందని రజనీకాంత్ స్పష్టం చేశారు.
తొలుత ఈ వ్యాక్సిన్ను వచ్చే ఏడాది రెండవ క్వార్టర్లో విడుదల చేయాలని శాస్త్రవేత్తలు భావించారు.కానీ అంతకంటే ముందుగా తీసుకురానున్నట్లు తాజాగా ప్రకటించారు.
కొవాగ్జిన్ తుదిదశ క్లీనికల్ ట్రయల్స్ ఈ నెలలోనే ప్రారంభమయ్యాయని, త్వరలోనే అవి పూర్తి అవుతాయని భారత్ బయోటెక్ ప్రకటించింది.క్లీనికల్ ట్రయల్స్ పూర్తైన తర్వాత ఉత్పత్తి మొదలవుతుందని పేర్కొంది.
బయోటెక్, ఐపీఎంఆర్ ఆధ్వర్యంలో కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నారు. ఫేజ్-1, ఫేజ్-2 ప్రయోగాల్లోనూ, జంతువులపై జరిపిన ప్రయోగాల్లోనే ఈ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేసింది.
దీంతో ఈ వ్యాక్సిన్ కోసం భారతీయులందరూ ఎదురుచూస్తున్నారు.
ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోందని రజనీకాంత్ తెలిపారు.
ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రజనీకాంత్ పేర్కొన్నారు.వీలైనంత త్వరగా ఈ వ్యాక్సిన్ తీసుకురావాలని కేంద్రం భావిస్తోందన్నారు.