మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య.ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.
చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం రామ్ చరణ్ కీలకపాత్రదారి.నక్సల్స్ నేపథ్యంలో సాగే కథ ఇదని దేవాలయాల నేపథ్యం కూడా కనిపిస్తుందని ముందు నుంచి టాక్ వినిపిస్తుంది.షూటింగ్ పూర్తయితే గుమ్మడికాయ కొట్టేందుకు సిద్ధంగా ఉంది చిత్రంబృందం.ఈ సినిమా కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టకపోతే ఇపాటికే విడుదల కావాల్సి ఉండేది.చిరంజీవి తదిపరి చిత్రం ఇప్పుడు పట్టాలు ఎక్కుతుంది.మలయాళ హిట్ చిత్రం “లూసిఫర్ ” చిరంజీవి 153వ చిత్రంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.
చిరంజీవి తన 154వ చిత్రం కోసం దర్శకుడు కె.ఎస్.రవిచంద్ర(బాబీ)తో కలిసి పని చేయనున్న విషయం తెలిసిందే.ఈ చిత్రంలో చిరు తండ్రీకొడుకులుగా నటించబోతున్నారట.
చిరు మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారు అన్నమాట.మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ వన్ లో కూడా ఏం చేశారు.
అయినా డబల్ పాత్ర పోషిస్తున్న రెండో చిత్రం ఇది.ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తుంది.పూర్తి వివరాలు నటీనటుల వివరాలు చిత్రబృందం వెల్లడించనుంది.