టీటీడీ ఉద్యోగులకి బ్రహ్మోత్సవాల బహుమానం !

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులు శ్రీవారి బ్రహ్మోత్సవాల కానుకగా రూ.14,000 బహుమానం అందుకోనున్నారు.టీటీడీ బ్రహ్మోత్సవ బహుమానంగా టీటీడీ ఉద్యోగులకు 21 కోట్ల రూపాయలు చెల్లించనున్నది.శాశ్వత ఉద్యోగులకు 14వేల రూపాయలు, కాంట్రాక్టు ఉద్యోగులకు 6850 రూపాయలు టీటీడీ చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.

 Ttd, Tirumala, Tirupati , Srivaru, Balaji, Brahmotsavalu,jawahar Reddy-TeluguStop.com

టీటీడీ ఉద్యోగులతోపాటు అనుబంధ సంస్థల ఉద్యోగులకు కూడా టీటీడీ బ్రహ్మోత్సవ కానుకగా నగదు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది.

ఇక సర్కులర్ పై కొత్తగా టీటీడీ ఈవో గా భాద్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి తొలి సంతకం చేశారు.

అతి త్వరలో ప్రారంభం కానున్న వార్షిన నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఉద్యోగులకు నగదు కానుకలిచ్చే ఫైలు పై తొలి సంతకం చేశారు.బ్రహ్మోత్సవ బహుమానంపై తొలి సంతకం చేయడం చాలా ఆనందంగా వుందని జవహర్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇకపోతే , శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై టీటీడీ ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతుంది.నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆనంద నిలయం బయట నిర్వహిస్తామని, తిరుమాడ వీధుల్లో శ్రీవారి వాహన సేవలు కొనసాగుతాయని 20 రోజుల క్రితం టీటీడీ ప్రకటించింది.

తాజాగా ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నందున బ్రహ్మోత్సవాల నిర్వహణపై టీటీడీ బోర్డు పునరాలోచనలో పడింది.సెప్టెంబర్ నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లుగానే స్వామివారి ఆలయంలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం బెటరన్న అభిప్రాయం పలువురిలో వినిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube