చనిపోయిన వ్యక్తిని పూడ్చి పెడితే బయటకు తీసి మరీ గొంతు కోశారు.. ఎందుకో తెలిస్తే మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే

మూడ నమ్మకాలు మనిషిని ఏం చేసేందుకు అయినా వెనకాడకుండా చేస్తున్నాయి.డబ్బు కోసం మూడ నమ్మకాలను నమ్మి ఒక వ్యక్తి ఇటీవలే గోదావరిలో తన భార్యను ముంచిన విషయం మరిచి పోకుండానే మరో దారుణం జరిగింది.

 Body Was Taken From Tomb And Then Slit The Neck1tstop-TeluguStop.com

డబ్బు సంపాదన కోసం కాదు కాని మోక్షం దక్కాలనే ఉద్దేశ్యంతో ఒక వ్యక్తి చనిపోయిన శవంను భూమిలోంచి తీసి మరీ పీక కోయడం జరిగింది.ఈ దారుణం ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది.

అత్యంత రాక్షసంగా జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

చనిపోయిన వ్యక్తిని పూడ్చి పె�

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఇటీవల ఒక 90 ఏళ్ల వృద్దుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తికి సంబంధించిన బందువులు కేసు నమోదు చేయడం, పోలీసులు కేసు నమోదు చేసి బాధ్యులను అరెస్ట్‌ చేయడం కూడా జరిగింది.అంతా ఫార్మాల్టీస్‌ అయ్యాయి.

ఆ వృద్దుడి శవాన్ని స్మశాన వాటికలో పూడ్డి పెట్టడం జరిగింది.కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంత్రంకు బంధువులు ఇంటికి వెళ్లారు.

బంధువులు శోకంలో మునిగే ఉన్న సమయంలో స్మశాన వాటిక నుండి సమాచారం వచ్చింది.

చనిపోయిన వ్యక్తిని పూడ్చి పె�

రాత్రి సమయంలో ఎవరో చనిపోయిన వృద్దుడి శవాన్ని బయటకు తీసి గొంతు కోశారంటూ స్మశాన వాటికకు సంబంధించిన వారు సమాచారం ఇవ్వడంతో మళ్లీ బంధువులు కొందరు వెళ్లి చూడటం జరిగింది.ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.

స్థానికుడు ఒక వ్యక్తి ఈ పని చేసినట్లుగా పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.మూడ నమ్మకాలను ఎక్కువగా నమ్మే ఆ వ్యక్తి శవాన్ని గొంతు కోసి ఉంటాడని అంటున్నారు.

అతడిని విచారిస్తున్న పోలీసులు త్వరలోనే పూర్తి వివరాలను వెళ్లడించే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube