తమిళంలో స్టార్ హీరో ధనుష్ నటించిన సెన్సేషనల్ మూవీ ‘అసురన్’ ఎలాంటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో ధనుష్ సూపర్ సక్సెస్ కొట్టాడు.
ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తెలుగు హక్కులను సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ను హీరోగా పెట్టి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరైతే బాగుంటుందా అని ఆలోచించి, చివరకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్ట’ వంటి సినిమాను అందించిన శ్రీకాంత్ అడ్డాలను దర్శకుడిగా ఫిక్స్ చేశారు.ఈ సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, షూటింగ్ కోసం రెడీ అవుతోంది.
అయితే ఈ సినిమా పూర్తిగా పల్లెటూరి బ్యాక్డ్రాప్లో తెరకెక్కనుండటంతో ఈ సినిమాను అనంతపురం ప్రాంతంలో షూటింగ్ నిర్వహించాలని చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ సరికొత్త అవతారంలో మనకు కనిపిస్తాడు.
ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ మరో లెవెల్లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.కాగా ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియమణి నటించనుంది.
తమిళంలో లాగానే తెలుగులోనూ ఈ సినిమా అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంటుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్గా ఉంది.