మందుబాబుల అరెస్ట్

నల్లగొండ జిల్లా:ఆదివారం ఆరుబయట ప్రకృతిలో సిట్టింగ్ వేసి హాయిగా రెండు పెగ్గులు వేద్దామనుకున్న మందుబాబుల మనోభావాలు దెబ్బతీశారు సాగర్ పోలీసులు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమంటూ మద్యం ప్రియుల నోటికి బేడీలు వేశారు.

ఈ విషాదకర సంఘటన నాగార్జునసాగర్ లో చోటుచేసుకుంది.నందికొండ విజయపురి నార్త్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న10 మందిని ఆదివారం అదుపులోకి తీసుకొని,వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు.

పట్టుబడిన మందు బాబులను వ్యక్తిగత పూచీకత్తుపై పంపించి,సోమవారం కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.బహిరంగ ప్రదేశంలో ఎవరైనా మద్యం సేవిస్తే కఠినంగా వ్యవహరిస్తామని,ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఎస్ఐ హెచ్చరించారు.

దేవరకొండ యువతి గిన్నిస్‌ బుక్‌ రికార్డు
Advertisement

Latest Nalgonda News