నవోదయలో 1,377 ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు

నల్లగొండ జిల్లా:నిరుద్యోగులకు శుభవార్త.దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది నియామకానికి దరఖాస్తుల స్వీకరణ గడువును నవోదయ విద్యాలయ సమితి మరోసారి పొడిగించింది.

మొత్తం 1,377 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మే 14 వరకు అవకాశం కల్పించగా,నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 30వ తేదీతోనే గడువు ముగిసింది.ఈ క్రమంలో మే 7వ తేదీ వరకు గడువు పెంచుతూ తాజాగా మరోసారి గడువు పొడిగిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది.

Latest Nalgonda News