ఒక్కరైనా మారుతారు కదా.. యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్!

సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి.ఎన్నో విషయాలు ఇతరులకు పంచుకుంటూ ఉంటాము.

 Anchor Rashmi Post That Will Change Anyone Also And It Goes Viral Details, Rash-TeluguStop.com

పంచుకోవడం వల్ల, తెలుసుకోవడం వల్ల చాలా వరకు కొంత నేర్చుకున్నట్లు ఉంటుంది.ఇలా కొంత మంది సోషల్ మీడియాలో వచ్చే విషయాల గురించి పూర్తిగా తెలుసుకొని వాటి విలువలు పాటిస్తూ ఉంటారు.

అలా రష్మీ గౌతమ్ కూడా ఇతరులకు సహాయపడే విధంగా సోషల్ మీడియాను వాడుతుంది.

బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన రష్మీ గౌతమ్ యాంకర్ గా మంచి పేరు సంపాదించుకుంది.

కెరీర్ మొదట్లో వెండితెరపై అడుగుపెట్టగా అందులో సైడ్ ఆర్టిస్ట్ గా పనిచేసింది.కానీ అంత గుర్తింపు ఉన్న నటిగా మాత్రం పేరు సంపాదించుకోలేదు.ఇక జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టాక తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది.

పైగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

నిజానికి జబర్దస్త్ షో రష్మీ కి మంచి క్రేజ్ అందించింది.ఈ షో ప్రారంభం నుంచి రష్మీ యాంకర్ గా కొనసాగుతుంది.

ఇప్పటికి ఈ షో లోనే యాంకర్ గా కొనసాగుతుంది.ఇందులో తన గ్లామర్ తో కుర్రాళ్లను బాగా ఫిదా చేస్తుంది.

తన మాటలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.

ఇక మరో ఆర్టిస్ట్ సుడిగాలి సుధీర్ తో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.అతనితో కలిసి తెగ రొమాన్స్ లు చేస్తూ బాగా రెచ్చిపోతుంది.ఇదంతా షో కోసమే చేస్తూ ఉంటారు.

అలా రష్మీ తెర ముందు ఇలా రెచ్చి పోతూ ఉంటే తెరవెనుక మాత్రం ఎంతో మంచి మనసున్న వ్యక్తిగా నిలిచింది.రష్మీ సోషల్ మీడియాలో ఫుల్ బిజీ గా కనిపిస్తుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పంచుకోవటమే కాకుండా.సమాజంలో జరిగే విషయాల గురించి కూడా బాగా పట్టించుకుంటుంది.

అంతేకాకుండా జంతువుల పట్ల తాను చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు.ఏదైనా మూగ జీవికి ఏమైనా అయితే వెంటనే రియాక్ట్ అవుతుంది.

కొన్నిసార్లు బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

గతంలో ఎన్నో మూగజీవుల స్టోరీలను పంచుకొని చాలా ఎమోషనల్ అయ్యింది.నిజానికి ఈమె మూగ జీవులను ఎంతో ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది.వాటిని సరిగ్గా చూసుకోవాలి అని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేస్తూనే ఉంటుంది.

గతంలో లాక్ డౌన్ సమయంలో రష్మీ.రోడ్లపై జీవిస్తున్న మూగజీవుల దగ్గరికి వెళ్లి వాటికి భోజనం అందించింది.

అంత గొప్ప మనసున్న రష్మీ. ప్రతి రోజు ఏదో ఒక పోస్టు తో ఏదో ఒక విషయాన్ని తెలియజేయాలని చూస్తుంది.తాజాగా సోషల్ మీడియా వేదికగా మరో పోస్ట్ షేర్ చేసింది.అందులో.తనను ప్రతిరోజు జంతు సంరక్షణ గురించి ఎందుకు పోస్టులు పెడుతున్నావు అని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారని తెలిపింది.ఇక ఈ ప్రపంచం ఎప్పుడు మారుతుందని, ఎలా మారుతుందని తనకు తెలియదని అన్నది.

కానీ మారుతుందన్న ఆశ తనలో ఉందని.ప్రతిరోజు ఉదయం లేచాక తన పోస్టు చూసి ఎవరో ఒకరు మారుతారేమో అన్న ఆశ తనకు ఉందని తెలిపింది రష్మీ.

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube