యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సరళ మైసమ్మ వైన్స్ షాపులో కొనుగోలు చేసిన బీరు బాటిల్ అడుగుభాగాన సిగరెట్ పీకలు ఉండడంతో మందుబాబుల ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదేంటని వైన్స్ యజమాన్యాన్ని నిలదీయగా సమాధానం ఇవ్వకుండా మిన్నకుండి పోయారు.
ఈ సందర్భంగా మద్యం ప్రియులు మాట్లడుతూ ఇలాంటివి చూసుకోకుండా మద్యం ఎలా తయారు చేస్తున్నారని మండిపడ్డారు.తక్షణమే ఎక్సైజ్ శాఖ అధికారులు వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కంపెనీ తయారీలో అన్ని చెక్ చేశాక సీల్ చేస్తారని, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇది కల్తీ మద్యంగా అనుమానం వస్తుందని,ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే ఈ పరిస్థితి ఉండదని అంటున్నారు.ఇప్పటికైనా మద్యం తనిఖీలు నిరంతరం చేస్తూ,కల్తీ మద్యం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేనియెడల మద్యం ప్రియులే తిరగబడే ఛాన్స్ ఉందని హెచ్చరించారు.