ఏపీలో సామాజిక న్యాయం అందించిన ఘనత సీఎం జగన్( CM Jagan ) కే దక్కుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల( Sajjala ) అన్నారు.సామాజిక న్యాయం మాటల్లో కాదు చేతల్లో చూపించామని పేర్కొన్నారు.
సంక్షేమం ద్వారా ప్రతి ఒక్కరి చేతికి డబ్బులు వచ్చాయని తెలిపారు.వైసీపీ ( YCP )పాలనలో పంచాయతీల రూపురేఖలు మారాయని చెప్పారు.
రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.రానున్న ఎన్నికల్లోనూ మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అవి అమలు అవుతాయని తెలిపారు.