పవన్ కళ్యాణ్,ఏపీ మంత్రి రోజా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విషయం తెలిసిందే.గతంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు చాలాసార్లు ఆరోపణలు సెటైర్లు వేసుకున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా రోజా పవన్ కళ్యాణ్ ను ప్రతిసారి విమర్శిస్తూ సెటైర్లు వేస్తూ ఉంటారు.పవన్ కళ్యాణ్ జగన్ ని ఏదో ఒకటి అనడం, రివర్స్ లో రోజా పవన్ కళ్యాణ్( Pawan kalyan) పై సెటైర్లు వేయడం అన్నది చాలా సార్లు జరిగిన విషయం తెలిసిందే.
మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ విశాఖ బహిరంగ సభలో మాట్లాడుతూ.వైసీపీ నేతల అవినీతి చిట్టా తన దగ్గర ఉందని, దాని సాయంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి జగన్ ను ఒక ఆట ఆడిస్తానని పవన్ సంచలన వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే పవన్ పై వైసీపీ నేతలు మాటల దాడి చేయడం మొదలెట్టారు.ఈ క్రమంలోనే పవన్ పై మంత్రి రోజా( Roja ) సంచలన వ్యాఖ్యలు చేశారు.తన సినిమాను నాలుగు ఆటలు ఆడించుకోలేక చతికిల పడ్డ బ్రో పవన్,సీఎం జగన్ ను ఆడిస్తాడంట అంటూ పవన్ పై సెటైర్లు వేశారు.జగన్ ను ఆడించడం, ఓడించడం దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే కాలేదు, అలాంటిది పవన్ వల్ల ఏమవుతుంది అంటూ ఆమె పవన్ ని చాలా తక్కువ చేసి మాట్లాడడంతో పాటు అవమానించినట్టుగా కూడా వ్యాఖ్యలు చేశారు రోజా.
చంద్రబాబు ఆడుతున్న రాజకీయ ఆటలో పవన్ అరటిపండు లాంటి వాడు.
అటువంటి పవన్ జగన్ ను ఏం ఆడిస్తాడు అంటూ ఎద్దేవా చేసింది.చంద్రబాబు చెప్పిన మాటలు,ఎల్లో మీడియా రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప పవన్ కు ఏమీ రాదని చురకలు అంటించారు.జనసేనకు జెండా, ఎజెండా లేవని చెప్పుకొచ్చారు.
ప్రజారాజ్యం, జనసేనలను నమ్ముకున్న వారి కోసం ఇది చేశామని చెప్పే పరిస్థితి లేదని అన్నారు రోజా.చంద్రబాబుకు ఓటు వేయాలి అని పవన్ పరోక్షంగా అభ్యర్థిస్తున్నట్లు కనిపిస్తోందని ఆమె అన్నారు.
తాజాగా రోజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో సంచలనంగా మారాయి.