అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.రాంబిల్లి మండలంలోని ఓ ఫార్మా ప్రైవేట్ కంపెనీలో రెండు రియాక్టర్లు పేలాయి.
దీంతో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసి పడుతుండగా మరోవైపు దట్టమైన పొగ అలుముకుంది.ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందారని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.భారీగా శబ్ధం రావడంతో పాటు మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.