పార్వతీపురం మన్యం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది.కొడుకు మృతదేహాన్ని నిస్సహాయ స్థితిలో రిక్షాలో తరలించింది ఓ తల్లి.
ఈ హృదయవిదాకర ఘటన పార్వతీపురంలో జరిగింది.జిల్లా ఆస్పత్రిలో కిషోర్ అనే యువకుడి మృతిచెందాడు.
అయితే అంబులెన్స్ ఖర్చు భరించలేక రిక్షాలో మృతదేహాన్ని తరలించినట్లు తెలుస్తోంది.దీంతో అంబులెన్స్ సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.