నిజామాబాద్ నీలకంఠేశ్వరాలయంలో అపచారం...

నిజామాబాద్ నీలకంఠేశ్వరాలయం( Nizamabad )లో అపచారం జరిగింది.పుష్కరిణిలో దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈవో వేణు జలకాలాడారు.

 Mischief In Nizamabad Neelkantheswara Temple... Neelakantheswara Temple , E.o V-TeluguStop.com

అభిషేకం జరుగుతుండగా దర్జాగా ఈవో ఈత కొట్టారు.దక్షిణ కాశీగా నీల కంటేశ్వర ఆలయం( Neelakantheswara temple ) ప్రసిద్ధి ఉంది.

అలాంటి పుష్కరణిలో, అది కూడా దేవుని విగ్రహాలకు అభిషేకం నిర్వహిస్తుండగా ఇలా చేయడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.పుష్కరిణిలో ఈత కొట్టద్దు అంటూ అర్చకులు వారిస్తున్నా ఈవో వేణు( E.O VENU ) ఈత కొట్టినట్లు తెలుస్తోంది.సోషల్ మీడియాలో ఈవో వేణు వీడియో వైరల్ కావడంతో.

ఈ వ్యవహారం బయటపడింది.వేణు మొత్తం నాలుగు ఆలయాలకు ఇంఛార్జ్ ఈవోగా ఉన్నారు.

అలాంటి బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న అధికారి ఇలా పుష్కరణిలో దేవునికి అభిషేకం చేసే సమయంలో ఈత కొట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

నీలకంఠేశ్వర ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది.

ఆలయం నీలకంఠేశ్వర రూపంలో శివునికి( Lord shiva ) అంకితం చేశారు.ఈ ఆలయం 15వ శతాబ్దంలో కాకతీయ రాజవంశం నిర్మించబడింది.

ఈ ప్రాంతంలోని పురాతన దేవాలయాలలో ఒకటిగా పరిగణిస్తారు స్థానికులు.ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది.

ఈ ఆలయం 2000లో పునర్నిర్మాణం చేశారు.ఈ ఆలయంలో శివుడు నీలకంఠేశ్వర రూపంలో పూజించబడతాడు.

ఆలయ సముదాయంలో చాలా మండపాలు కూడా ఉన్నాయి.మండపాలు కూడా హిందూ పురాణాలలోని దృశ్యాలను వర్ణించేలా శిల్పాలు, శిల్పాలతో అలంకరించి ఉన్నాయి.

ఆలయ సముదాయం చుట్టూ పెద్ద గోడ కూడా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube