రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) హీరోగా గౌతమ్ తిన్ననూరి( Goutham thinnanuri ) దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.సినిమా ను త్రివిక్రమ్ భార్య తో కలిసి సితార ఎంటర్ టైన్మెంట్స్ లో నాగ వంశీ( Naga vamshi ) నిర్మిస్తున్నాడు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మరి కొన్ని రోజుల్లోనే మొదలు అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇక ఈ సినిమా నుండి తాజాగా వచ్చిన పోస్టర్ వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే.
కాపీ చేశారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తే.మరి కొందరు మరో రకంగా విమర్శలు చేయడం జరిగింది.వాటికి నిర్మాత నాగవంశీ తనదైన శైలిలో స్పందించాడు.తాజాగా ఈ సినిమా విడుదల విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.లైగర్ సినిమా తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్న విజయ్ దేవరకొండ ఖుషి సినిమా విడుదల అయిన చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.ఆకట్టుకునే కథ మరియు కథనం తో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.
రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు నమోదు చేసుకునే సత్తా ఉన్న కంటెంట్ అంటూ మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు.రామ్ చరణ్ కోసం గతంలో అనుకున్న కథ ను ఇప్పుడు విజయ్ దేవరకొండ తో రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి గౌతమ్ తిన్ననూరి మరో విభిన్నమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి.అయితే చిత్ర యూనిట్ సభ్యుల నుండి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల అయితే బాగుంటుంది కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మేకర్స్ నిర్ణయం ఏంటి అనేది చూడాలి.