మెదక్ జిల్లా రామాయంపేటలో కారు బీభత్సం సృష్టించింది.రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారులపైకి కారు దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడగా.పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
బస్టాండ్ వద్ద రోడ్డు పక్కన పండ్లను అమ్ముకుంటున్న వారిపైకి కారు దూసుకెళ్లింది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
మృతురాలు ధర్మారంకు చెందిన మహిళగా గుర్తించారు.అతివేగం వలనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.







