కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రం అసత్య ఆరోపణలు చేస్తోందని బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు.రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులకు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని కేకే డిమాండ్ చేశారు.ప్రధాని మోదీ కార్యక్రమం నిర్వహిస్తే కేసీఆర్ ప్రొటోకాల్ పాటించడం లేదని విమర్శిస్తున్నారు.
కానీ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సీఎంగా ఉన్న మోదీ ఎన్నో అధికారిక కార్యక్రమాలకు గైర్హాజరు అయ్యారన్న విషయాన్ని కేకే గుర్తు చేశారు.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కారణంగా ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని మోదీ చెప్పడం సరికాదని పేర్కొన్నారు.