ఒక్క క్షణం కూడా మర్చిపోలేను... భర్తను తలుచుకొని ఎమోషనల్ అయినా అలేఖ్య రెడ్డి?

నందమూరి తారక రత్న (Tarakaratna)మరణ వార్త ఇప్పటికి జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి.ఈయన ఫిబ్రవరి 18 వ తేదీ అనారోగ్య సమస్యలతో బెంగళూరులోని ఆస్పత్రిలో మరణించిన విషయం మనకు తెలిసిందే.

 Cant Forget Even For A Moment Alekya Reddy Is Emotional After Touching Her Husba-TeluguStop.com

ఇలా తారకరత్న మరణించి దాదాపు రెండు నెలలు కావస్తున్న ఇప్పటికి అభిమానులకు ఈ విషయం జీర్ణించుకోలేనిదని చెప్పాలి.ఇక తారకరత్న మరణ వార్తతో తన భార్య అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) ఎంతో దుఃఖసాగరంలో మునిగిపోయారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్లిపోవడంతో ఆమె ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.

ఇలా తన భర్త మరణంతో ఎంతో కృంగిపోతున్న అలేఖ్య ఎప్పటికప్పుడు తన భర్తతో గడిపిన ఆనంద క్షణాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు.ఇలా ఇదివరకే ఎన్నో విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయిన అలేఖ్య రెడ్డి తాజాగా మరొక వీడియోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.తాజాగా ఈమె తారకరత్న తన పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉన్నటువంటి హ్యాపీ మూమెంట్స్ కి సంబంధించినటువంటి ఒక వీడియోని షేర్ చేశారు.

ఇలా ఈ వీడియోని షేర్ చేసిన అలేఖ్య నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా ఉండలేకపోతున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు తారకరత్న అన్న మరణ వార్త మాకే ఎంతో కఠినంగా ఉంది మీకు ఎలా ఉంటుందో మేము అర్థం చేసుకోగలము మీరు తొందరగా ఈ బాధ నుంచి బయటపడాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.లోకేష్ పాదయాత్రలో భాగంగా జనవరి 27వ తేదీ గుండెపోటుకు గురై దాదాపు 23 రోజులపాటు బెంగళూరులో చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube