ఈ సంక్రాంతికి మెగా మరియు నందమూరి అభిమానులకు పండగ వాతావరణం రెట్టింపు అవ్వబోతుంది.చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలు విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
ఈ రెండు సినిమాల హడావుడి ఇప్పటికే మొదలు అయ్యింది.రెండు సినిమాల నుండి పోటా పోటీగా పాటలు వచ్చాయి.
అంతే కాకుండా ఈ రెండు సినిమా ల యొక్క పోస్టర్స్ మరియు మేకింగ్ వీడియో లు విడుదల అయ్యాయి.ఇక ఈ రెండు సినిమాల యొక్క ట్రైలర్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు.
వీర సింహారెడ్డి సినిమా యొక్క ట్రైలర్ ను మరో రెండు రోజుల్లో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.ఇక వాల్తేరు వీరయ్య సినిమా యొక్క ట్రైలర్ కూడా ఒక్కటి రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
అన్ని వర్గాల వారిని కూడా ఈ రెండు సినిమా లు ఆకట్టుకుంటాయి అంటూ మైత్రి మూవీ మేకర్స్ వారు చాలా నమ్మకంతో ఉన్నారు.ఈ రెండు సినిమా లకు ఇప్పటికే మంచి బజ్ ఉంది.
ఇప్పటి వరకు ఉన్న బజ్ ను రెట్టింపు చేసే విధంగా ట్రైలర్స్ ఉండబోతున్నాయి అంటూ యూనిట్ సభ్యుల వారు చెబుతున్నారు.రెండు సినిమా ల యొక్క ట్రైలర్స్ రెడీ గా ఉన్నాయి.
రెండు ట్రైలర్స్ ను కొందరు చూసి వావ్ అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ లు పెడుతున్నారు.వీర సింహా రెడ్డి సినిమా యొక్క ట్రైలర్ ను థమన్ చూశాను అంటూ ట్వీట్ చేశాడు.
యూట్యూబ్ లో రచ్చ ఖాయం అన్నట్లుగా ఆయన ట్వీట్ చేశాడు.అంతే కాకుండా సంక్రాంతికి సినిమా కుమ్మేస్తుంది అంటూ చాలా నమ్మకంతో థమన్ ట్వీట్ చేయడం జరిగింది.భారీ అంచనాల నడుమ రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా యొక్క ట్రైలర్ పై ఆసక్తి నెలకొంది.