బిగ్ బాస్ సీజన్ 6 ఫైనల్ వీక్ మరో షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు ఇంటి సభ్యులు ఉండగా మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి ఒక కంటెస్టంట్ ని బయటకు పంపించేశారు.
ప్రస్తుతం హౌస్ లో రేవంత్, ఆది రెడ్డి, శ్రీహాన్, రోహిత్, కీర్తి, శ్రీ సత్య ఉన్నారు.వీరిలో ఈరోజు బిగ్ బాస్ చేసిన మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఆడియన్స్ ఓటింగ్ తో శ్రీ సత్య ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది.
హౌస్ లో మొదట మాములు కంటెస్టంట్ గా అనిపించిన శ్రీ సత్య ఫైనల్ వీక్ వరకు వచ్చింది.ఈ సీజన్ లో ఆమె టాప్ 6గా నిలిచింది.టాప్ 5 లో నిలిచే సత్తా ఉన్నా కీర్తి, రోహిత్ లు ఈమధ్య స్ట్రాంగ్ అవడం వల్ల ఆమె ఎలిమినేట్ అవక తప్పలేదు.ఫైనల్ గా శ్రీ సత్య బిగ్ బాస్ ఆట ముగిసింది.
హౌస్ లో రేవంత్, శ్రీహాన్ లతో శ్రీ సత్య మంచి బాండింగ్ ఏర్పరచుకుంది.సీరియల్స్ చేస్తూ పాపులర్ అయిన శ్రీ సత్య బిగ్ బాస్ ద్వారా చాలామంది ఆడియన్స్ కి దగ్గరైంది.