1.భారత్ నుంచి యూఏఈ వెళ్లే వారికి కొత్త ఆంక్షలు
కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ తో పాటు 12 దేశాల నుంచి యూఏఈ వెళ్లే వారికి కొత్త ప్రయాణ ఆంక్షలు విధించారు.కోవిడ్ 19 పీఆర్ సీ నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని, ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది అని యూఏఈ ప్రకటించింది.
2.భారత్ తో పాటు ఏడు దేశాలపై హాంకాంగ్ ఆంక్షలు
హాంకాంగ్ లోనూ ఒమి క్రాన్ కేసులు పెరిగిపోతూ ఉండడం తో భారత్ తో పాటు ఎనిమిది దేశాలపై విమాన ప్రయాణ ఆంక్షలు విధించింది.ఈ ఎనిమిది దేశాల కు విమాన రాకపోకలను పూర్తిగా నిషేధించింది.
3.యూఏఈ ఇండియా మధ్య భారీగా తగ్గిన విమాన చార్జీలు
యూఏఈ ఇండియా మధ్య విమాన ప్రయాణాలు తగ్గుముఖం పట్టడం తో ప్రయాణ ఛార్జీలు భారీగా తగ్గాయి.
4.యూఏఈ గోల్డెన్ వీసాదారులకు చక్కటి అవకాశం
యూఏ ఈ గోల్డెన్ వీసాదారులకు చక్కటి అవకాశం దక్కింది.ఎటువంటి డ్రైవింగ్ క్లాస్ లు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశాన్ని కల్పించింది.
5.క్షిపణి ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా
కొత్త సంవత్సరం లో ఉత్తర కొరియా తొలి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టింది.ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రి ధృవీకరించారు.
6.మోదీని ఓడించలన్న పాక్ నటుడు
పాక్ నటుడు జావేద్ షేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.భారత ప్రధానిగా నరేంద్ర మోదీ తప్పుకోవాలని పాకిస్థాన్ లోని సినీ పరిశ్రమ లోని వారు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
7.జియాంగ్ సిటీలో వస్తు మార్పిడి పద్దతి
చైనాలోని జీయాంగ్ సిటీలో లాక్ డౌన్ అమలులో ఉండడం తో చాలామంది ఆహార కొరత తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీంతో వస్తు మార్పిడి పద్ధతిని అక్కడ ప్రజలు పాటిస్తున్నారు.
8.ఫ్రాన్స్ అధ్యక్షుడి హెచ్చరికలు
కరోనా వాక్సిన్ వేయించుకోని వారి జీవితాలను మరింత కఠినతరం చేస్తామంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ హెచ్చరించారు.
9.గాల్వాన్ లోయలో ఎగిరిన త్రివర్ణ పతాకం
చైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన గాల్వాన్ లోయలోనే ఇప్పుడు భారత్ కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు.
10.ఒమి క్రాన్ పై డబ్ల్యూహెచ్వో హెచ్చరికలు
ఒమి క్రాన్ పై డబ్ల్యూహెచ్వో హెచ్చరికలు జారీ చేసింది.ఒమి క్రాన్ వైరస్ ను అంత తేలిగ్గా తీసుకోవద్దు అని, శరీర వ్యవస్థ పై అది తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని వెల్లడించింది.