2021లో సక్సెస్ ను కంటిన్యూ చేసిన టాలీవుడ్ దర్శకులు వీళ్ళే!

ప్రతి ఏడాది ఎంతో మంది దర్శకులు పలు చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.ఇలా కొందరు దర్శకులు మంచి విజయాలను తమ ఖాతాలో వేసుకుంటే మరికొందరు మాత్రం బాక్సాఫీసు వద్ద చేదు అనుభవాల్ని ఎదుర్కోవలసి వస్తుంది.

 Here Are The Tollywood Directors Who Will Continue Their Success In 2021, Tollyw-TeluguStop.com

ఈ క్రమంలోనే గతంలో కొన్ని సినిమాల ద్వారా ఎంతో అద్భుతమైన విజయాలను అందుకొని ఈ ఏడాది (2021) లోకూడా పలు చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అదే విజయాన్ని కొనసాగిస్తూ వచ్చారు.మరి ఈ ఏడాది వారి సక్సెస్ ను కంటిన్యూ చేసిన ఆ దర్శకులు ఎవరు అనే విషయానికి వస్తే.

సుకుమార్: 2018 వ సంవత్సరంలో రామ్ చరణ్, సమంత జంటగా తెరకెక్కిన చిత్రం రంగస్థలం.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా ద్వారా సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ సుకుమార్ ఈ ఏడాది “పుష్ప” సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.

Telugu Tollywood-Movie

వేణు శ్రీరామ్: వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 2017లో `ఎంసీఏ` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

Telugu Tollywood-Movie

శేఖర్ కమ్ముల: 2017 వ సంవత్సరంలో ఫిదా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డైరెక్టర్ ఈ సినిమాతో అందరిని ఫిదా చేశారు.ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల సాయిపల్లవి, నాగచైతన్య హీరోహీరోయిన్లుగా లవ్ స్టోరీ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

Telugu Tollywood-Movie

రాహుల్ సాంకృత్యన్: 2018 సంవత్సరంలో టాక్సీవాలా చిత్రం ద్వారా మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్ ఈ ఏడాది సాయి పల్లవి, కృతి శెట్టి, నాని కాంబినేషన్లో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ ఈ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

కిషోర్ తిరుమల: చిత్ర‌ల‌హ‌రి ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కిషోర్ తిరుమల ఈ ఏడాది ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాతో కిషోర్ తిరుమల మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

ఇలా ఈ ఏడాది డైరెక్టర్లు వారి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి వారి విజయ పరంపరను కొనసాగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube