దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా ఆర్ ఆర్ ఆర్.ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.ఇక ఇందులో చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంటే.
ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరీస్ నటిస్తుంది.
ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ మూడు సంవత్సరాలుగా కష్ట పడుతున్నారు.
రాజమౌళి సినిమాలంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒక్కో సినిమా సంవత్సరాలు సమయం తీసుకుంటాడు.
ఈ సినిమాను ముందే పూర్తి చెయ్యాలని టార్గెట్ అయితే పెట్టుకున్నారు కానీ కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది.దాదాపు మూడు సంవత్సరాలు ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ మొత్తం కష్టపడింది.
ఇక ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ ను రాజమౌళి పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేసారు.దీంతో చిత్ర యూనిట్ మొత్తం బందిఖానా నుండి బయటపడి స్వేచ్ఛగా విహరిస్తున్నారు.
ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకుని చరణ్, ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళిపోతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.ఇక తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న ఒలీవియా మోరిస్ కూడా హైదరాబాద్ రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించింది.
ఆమె హైటెక్స్ సిటీ మరియు శిల్పారామం సందర్శించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆమె సరదాగా గడపడంతో పాటు ఇక్కడి ఫుడ్ కూడా టేస్ట్ చేసిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి.
ఇక శిల్పారామం లో చిన్న షాపింగ్ కూడా చేసిందట.మొత్తానికి షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ రోడ్లపై ఎంజాయ్ చేసింది.