యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆది పురుష్.మైథలాజికల్ కథ అయినా రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది.
ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో ప్రభాస్ పురాణపురుషుడు శ్రీరాముడు పాత్రలో కనిపించబోతున్నాడు.అయితే ఇంత వరకు మనం చూసిన రాముడు తరహాలో కాకుండా ఈ పాత్రని దర్శకుడు చాలా పవర్ ఫుల్ గా రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేయబోతున్నాడని తెలుస్తుంది.
ఇక ఇందులో ప్రతినాయకుడు అయినా లంకేశ్ రావణ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నాడు.ఈ సినిమాని ఇండియన్ ఫిలిం చరిత్రలో మొట్టమొదటి సారిగా కంప్లీట్ గ్రీన్ మ్యాట్ స్టూడియోలో తెరకెక్కిస్తున్నారు.
ఆది పురుష్ కోసం ఎలాంటి అవుట్ డోర్ లొకేషన్స్ తీసుకోవడం లేదు.రామాయణ కాలం నాటి వాతావరణం, అయోధ్య పట్టణం అన్ని కూడా గ్రాఫిక్స్ మాయాజాలంతో చూపించబోతున్నారు.
మోషన్ క్యాపచ్యుర్ పద్దతిలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు.
ఇక ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ని దర్శకుడు ఓం రౌత్ తాజాగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.భారీ గ్రాఫిక్స్తో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన మోషన్ క్యాప్చర్ పనులను ప్రారంభించినట్లు ప్రభాస్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.మోషన్ క్యాప్చర్ బృందంతో కలిసి డైరెక్టర్ ఓం రౌత్ తీసుకున్న ఫొటోను కూడా ప్రభాస్ షేర్ చేశారు.
మోషన్ క్యాప్చర్ స్టార్టయ్యింది.ఆదిపురుష్ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు అని ప్రభాస్ పోస్ట్లో రాసుకొచ్చారు.
ఇక ఫిబ్రవరి 2 నుంచి ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది.ఏకంగా 90 రోజుల పాటు ఈ సినిమా కోసం ప్రభాస్ షూటింగ్ చేయనున్నారు.