తెలుగులో స్టార్ సంగీత దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి కీరవాణి.రెండు దశాబ్దాల పాటు తెలుగు సినీ ప్రపంచంలో తన పాటలతో శ్రోతలని అలరించిన కీరవాణి ఇప్పటికి సంగీతంతో అద్భుతాలు చేస్తున్నాడు.
కీరవాణి పాటలు అంటూ ఎలాంటి వెస్ట్రన్ వాసనలు లేకుండా అచ్చమైన నేటివిటీ కనిపిస్తుంది.వెస్ట్రన్ బీట్స్ లో కూడా చక్కనైన మెలోడీ వినిపిస్తుంది.
అలాంటి సంగీతం అందించే వారు చాలా అరుదు.ప్రస్తుతం కీరవాణి ఆర్ఆర్ఆర్ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాకి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్ మొదలైపోయింది.ఇదిలా ఉంటె ఈ సినిమాతో పాటు కీరవాణి మరో సినిమాకి కూడా సంగీతం అందించడానికి రెడీ అవుతున్నాడు.
పవన్ కళ్యాణ్ సినిమాకి సంగీతాన్ని అందించడానికి ఇప్పుడు కీరవాణి సిద్ధం అవుతున్నాడు.క్రిష్ దర్శకత్వంలో పవన్ పీరియాడికల్ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కథ అంతా కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది.పీరియాడికల్ మూవీ కావడంతో ఏఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.
దీనిని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఇక ఈ సినిమా ఇప్పటికే ప్రారంభోత్సవం జరుపుకుంది.
అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.ఇప్పుడు ఈ సినిమాకి సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్ ని క్రిష్-కీరవాణి మొదలుపెట్టినట్లు టాక్ వినిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ కెరియర్ లో కీరవాణితో చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం
.