డైరెక్టర్ నుండి హీరోగా మారిన వారు కొంతమంది మాత్రమే టాలీవుడ్లో సక్సెస్ అయ్యారు.వీరిలో ముందుగా చెప్పుకునే పేరు ఎస్వీ కృష్ణారెడ్డి.
ఆయన అప్పట్లో తెరకెక్కించిన సినిమాలు ఎలాంటి విజయాలను అందుకున్నాయో అందరికీ తెలిసిందే.ఇక హీరోగా మారి కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు.
ఆ తరువాత కొంతమంది డైరెక్టర్లు ప్రయత్నంచినా హీరోగా మెప్పించలేకపోయారు.
ఇప్పుడు మరో డైరెక్టర్ ఈ బాటలో పయనించేందుకు రెడీ అవుతున్నాడు.
మాస్ చిత్రాలతో టాలీవుడ్లో బ్లాక్బస్టర్లు అందించిన వివి వినాయక్ ప్రస్తుతం హీరోగా మారేందుకు రెడీ అవుతున్నాడు.సీనయ్య అనే సినిమాతో హీరోగా నిరూపించుకునేందుకు వినాయక్ ప్రయత్నిస్తున్నాడు.
కానీ ఈ సినిమా పట్టాలెక్కే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు.ఈ సినిమాను తెరకెక్కించేందుకు ముందుకొచ్చిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నుండి బయటకొచ్చేయాలని చూస్తున్నాడట.
దీంతో సీనయ్య సినిమా అటకెక్కేసిందని, ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కడం కష్టమే అని అంటున్నారు.కానీ ఏది ఏమైనా ఈ సినిమాను రిలీజ్ చేసి తీరుతామని చిత్ర యూనిట్ అంటోంది.
మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.