ఒక్క చిత్రం తోనే కొందరి జీవితాలు మారిపోతూ ఉంటాయి.టాలీవుడ్ లో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం ఒక్క హీరో జీవితాన్నే కాదు ఆ చిత్రం చేసిన ప్రతి ఒక్కరి జీవితం కూడా మారిపోయింది అని చెప్పాలి.
ఆ ఒక్క చిత్రం తరువాత హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుండగా, ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఏకంగా బాలీవుడ్ కే వెళ్లిపోయారు.ప్రస్తుతం అర్జున్ రెడ్డి రీమేక్ చేసి ఇటీవల విడుదల అయిన సంగతి తెలిసిందే.
షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో అర్జున్ రెడ్డి చిత్రం రీమేక్ చేయగా, ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించింది.ప్రస్తుతం రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది కూడా.
కేవలం నాలుగు రోజుల్లోనే వందకోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందట.
అయితే ఈ చిత్రం రిలీజ్ అయి నాలుగు రోజులు కూడా కాలేదు అప్పుడే బాలీవుడ్ లో సందీప్ కు మరో అవకాశం దక్కింది.ఈ సారి అలాంటిలాంటి ఆఫర్ కాదు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తోనే సినిమా చేసే అవకాశం లభించింది.సందీప్ తో సినిమా చేసేందుకు సల్మాన్ కూడా ఒకే చేశారట.
సో, త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ కూడా బయటకు రానున్నట్లు తెలుస్తుంది.