‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్లను అందుకున్న విజయ్ దేవరకొండ ‘నోటా’ చిత్రంతో నిరాశ పర్చాడు.అయితే గీత గోవిందం ఇచ్చిన సక్సెస్ క్రేజ్ కారణంగా నోటా లాంటివి ఇంకో మూడు నాలుగు పడ్డా కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ ఏమాత్రం తగ్గదు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.ఈ చిత్రం గీత గోవిందం చిత్రం కంటే ముందు రావాల్సి ఉంది.
కాని కొన్ని కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.
ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ కనిపించబోతున్నారు.అందులో ఒకరు మాళవిక నాయర్.ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్లకు మద్య రొమాన్స్ ఉండదు.
ఇద్దరు స్నేహితులుగా కనిపించబోతున్నారు.విజయ్ దేవరకొండ మొదటి చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో కూడా మాళవిక నాయర్ కనిపించింది.
ఆ చిత్రంలో విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్లు స్నేహితులు.ఇప్పుడు అలాగే ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.
ఆ కారణంగా ‘ట్యాక్సీవా’ చిత్రంకు సెంటిమెంట్ కలిసి వస్తుందనే టాక్ వినిపిస్తుంది.
పెద్ద ఎత్తున అంచనాలను మోసుకు వస్తున్న ‘ట్యాక్వీవాలా’ చిత్రం వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.రికార్డు స్థాయిలో బిజినెస్ను చేసిన ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ మరో విజయాన్ని సొంతం చేసుకుంటాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.అయితే సినీ వర్గాల్లో ప్రేక్షకుల్లో మాత్రం ఈ చిత్రంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
చాలా కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న కారణంగా సినిమాపై ఆసక్తి లేదు.కాని చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఈ చిత్రంపై హైప్ తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.