రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన అనుప రాజు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఇటీవల చనిపోయాడు.అతను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేశాడు.
తన కుటుంబాన్ని శనివారం జెడ్పిటిసి చీటి లక్ష్మణ్ రావు పరామర్శించి మనోదర్యాన్ని కల్పించి 10వేల ఆర్థిక సహాయం అనుప రాజు భార్యకు అందించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని అన్నారు.
పరామర్శించిన వారిలో అందే సుభాష్, పిల్లి కిషన్ తదితరులు ఉన్నారు.