నాగార్జున కాస్త గ్యాప్ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నాడు.‘భాయ్’ సినిమా ఫెయిల్యూర్తో నాగార్జున కథల ఎంపికలో పూర్తిగా తన విధానాన్ని మార్చుకున్నాడు.
ఈయన ‘మనం’ సినిమా తర్వాత ప్రస్తుతం ‘సోగ్గాడే చిన్ని నాయనో’ మరియు కార్తీతో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు.ఈ రెండు సినిమాలు ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.
ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాను నాగార్జున లైన్లో పెట్టే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
‘స్వామిరారా’, ‘దోచేయ్’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లను అందుకున్న దర్శకుడు సుధీర్ వర్మతో నాగార్జున సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది.
‘దోచేయ్’ సినిమా చూసిన తర్వాత నాగార్జున స్వయంగా సుధీర్ వర్మను పిలిచి సినిమా చేద్దాం అన్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ప్రస్తుతం ‘దోచేయ్’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తోన్న సుధీర్ వర్మ త్వరలోనే నాగార్జున కోసం స్క్రిప్ట్ను రెడీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చి అది సక్సెస్ అయితే సుధీర్ వర్మకు స్టార్ రేంజ్ దక్కడం ఖాయం అంటున్నారు.