కృష్ణ నటించిన మొదటి తెలుగు సినిమా విడుదలై 50 సంవత్సరాలు ఇటీవలే పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే.ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు మరియు అభిమానులు కృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశాడు.
అభిమానుల సమక్షంలో కృష్ణ కేక్ కట్ చేసి 50 సంవత్సరాల వేడుకను జరుపుకున్నాడు.అయితే ఈ వేడుకకు మహేష్బాబు వచ్చి ఉంటే బాగుండేదని, ఆయన వచ్చి అభిమానుల సమక్షంలో తండ్రి కృష్ణకు శుభాకాంక్షలు తెలియజేయాల్సి ఉందని అభిమానులు చర్చించుకున్నారు.
అయితే కారణాలు ఏమో తెలియదు కాని, మహేష్బాబు ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు.
ఆ రోజు కనీసం తండ్రికి శుభాకాంక్షలు కూడా తెలియజేయలేదు.
దాంతో అభిమానులు మహేష్బాబుపై కాస్త అసహనం వ్యక్తం చేశారు.అభిమానుల కోపాన్ని తెలుసుకున్న మహేష్బాబు ఎట్టకేలకు స్పందించాడు.
మహేష్బాబు తాజాగా ట్విట్టర్లో తన తండ్రికి శుభాకాంక్షలు తెలియజేశాడు.తెలుగు సినిమా పరిశ్రమ ముఖ్యుల్లో నాన్న ఉండటం నాకు ఎంతో గర్వ కారణం.
ఈ సినీ జీవితంలో నాన్న ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు.నాకు ఇప్పటికి, ఎప్పటికి నాన్న ఆదర్శం అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
షూటింగ్తో బిజీగా ఉండటం వల్ల నేరుగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయలేక పోతున్నట్లుగా మహేష్బాబు అభిమానులతో చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తోంది.