నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ప్రారంభానికి మరి కొన్ని గంటలే ఉంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్ల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న భారీ చిత్ర ప్రారంభంకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.
ఈ సినిమాను లండన్లో ప్రారంభించబోతున విషయం ఇప్పటికే తెల్సిందే.ఇక ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ సభ్యులు నేడు లండన్కు బయలుదేరుతున్నారు.
అక్కడున్న టీం సినిమా ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు.
డైరెక్షన్ డిపార్ట్మెంట్మెంట్తో పాటు ఇతర నటీనటులు, ప్రొడక్షన్ టీం అంతా నేడు లండన్ వెళ్తుండగా, ఎన్టీఆర్ మాత్రం రేపు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.
చిత్ర యూనిట్ సభ్యులు మొత్తం దాదాపు 50 రోజులు అక్కడే ఉండి చిత్రీకరణ జరుపనున్నారు.ఈ షెడ్యూల్తో సినిమాకు సంబంధించిన దాదాపు 65% షూటింగ్ పూర్తి చేయనున్నారు.‘1’ చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇదే అవ్వడం విశేషం.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.
ఎన్టీఆర్కు తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, విలన్గా జగపతిబాబు నటించనున్నారు.ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేస్తాం అని దర్శకుడు సుకుమార్ అంటున్నాడు.