వైసీపీకి విజయమ్మ రాజీనామా తర్వాత కొత్త చర్చ మొదలైంది.కొద్దిరోజులు గా పార్టీకి దూరంగా ఉంటున్న విజయమ్మ వైసీపీ ప్లీనరీ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు.
గతంలో కూడా విజయమ్మ రాజీనామా గురించి చర్చలు జరిగినప్పటికీ అది జరగలేదు.ప్రస్తుతం వైఎస్ షర్మిళ తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడంతో తన అవసరం ఉందంటూ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు.
గతంలో జగన్ కుటుంబం నుంచి వైఎస్ షర్మిళ, విజయమ్మ వైసీపీ కోసం పని చేశారు.ఇప్పుడు ఈ ఇద్దరూ వైసీపీకి దూరమవడంతో వైఎస్ ఫ్యామిలీ నుంచి పార్టీలో కొనసాగుతుంది జగన్ మాత్రమే.
కాగా ఈ నేపథ్యంలోనే జగన్ కు తోడు వైఎస్ ఫ్యామిలీ నుంచి మరొకరు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో వైఎస్ జగన్ ఫ్యామిలీ నుంచి పార్టీలోకి ఎవరు వస్తారనే దానిపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇక జగన్ భార్య వైఎస్ భారతి వైసీపీలోకి ఎంట్రీ ఇస్తారనీ అంతా చర్చించుకుంటున్నారు.అయితే ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ సభ్యుల ఎంట్రీ కొత్తేం కాదు.ఇది అన్ని పార్టీల్లో కొనసాగేదే.ఈ నేపథ్యంలోనే వైసీపీలో జగన్ తరువాత భారతి ఎంట్రీ ఇస్తారనే అంటున్నారు.
అయితే భారతి రాకతో ఇప్పటికప్పుడు పదవి బాధ్యతలు చేపట్టకపోయినా రానున్న ఎన్నికల్లో స్టార్ కాంపెయినర్ గా కొనసాగుతారని. పార్టీలో యాక్టివ్ పర్సన్ గా ఉంటారని అంటున్నారు.
ఇక ఇదే జరిగితే వైసీపీలో నంబర్ టూ భారతి అని అంటున్నారు.
![Telugu Bharathi, Cm Jagan, Sharmila, Vijayamma, Ycp, Ys Barathi, Ys, Ys Jagan, Y Telugu Bharathi, Cm Jagan, Sharmila, Vijayamma, Ycp, Ys Barathi, Ys, Ys Jagan, Y](https://telugustop.com/wp-content/uploads/2022/07/YS-Bharathi-as-Star-campaigner-from-YSR-family-Vijayamma-resignation-resignation-detailss.jpg )
ప్రస్తుతం షర్మిళ, విజయమ్మ దూరం అవడంతో అందుకే జగన్ తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారని అంటున్నారు.అందుకే తన భార్య వైఎస్ భారతిని తెరమీదకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారట.గత ఎన్నికల్లో ఆమె కేవలం పులి వెందులలో మాత్రమే ప్రచారం చేసిన భారతి వచ్చే ఎన్నికల్లో ఆమె రాష్ట్రం అంతటా తిరుగుతారని అంటున్నారు.
అలాగే వచ్చే ఎన్నికల్లో కడప నుంచి ఆ స్థానంలో బరిలోకి దిగుతారని కూడా అంటున్నారు.అలాగే పార్టీ పదవులలో కూడా భారతికా చాన్స్ ఉంటుందని అంటున్నారు.మొత్తానికి వైసీపీలో అమ్మా రాజీనామా తర్వాత భారతి కీలక బాధ్యతలు చేపడతారనే చర్చ నడుస్తోంది.