జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.నిన్న జనసేనాని పవన్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు.
సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ ఏకవచనంతో మాట్లాడారని మంత్రి గుడివాడ మండిపడ్డారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ఆగిపోయిందని ఏ కేంద్రమంత్రి చెప్పారని ప్రశ్నించారు.
అలాగే పవన్ కల్యాణ్ స్థిర నివాసం తెలంగాణలో ఉందన్న ఆయన ఏపీకి, పవన్ కు మధ్య సంబంధం ఏంటని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే ఏపీలో పవన్ ది ఏ నియోజకవర్గమో చెప్పమనండని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు డిపాజిట్లు కూడా రాలేదన్నారు.తెలంగాణలో బీజేపీని పవన్ నాశనం చేశారని విమర్శించారు.
కేవలం పొలిటికల్ కాంట్రాక్టుల కోసం పుట్టిన పార్టీ జనసేన అని దుయ్యబట్టారు.